నడికూడ,నేటిధాత్రి: మండలంలోని
చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలను తనిఖీ చేసే సందర్భంలో విద్యార్థులు రాగి జావ తాగుతుండగా రాగిజావ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకుని,విద్యార్థులతో రాగి జావా తాగారు. వంట రూమును పరిశీలించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో 2025 సంవత్సరం పిల్లల ఫోటోతో కూడిన క్యాలెండర్ ను శాసనసభ్యులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా చర్లపల్లి పాఠశాల ఉందని,ఇక్కడి పరిసరాలు,వసతులు,చాలా బాగున్నాయని విద్యార్థులు చాలా చక్కగా ఉన్నారని, విద్యార్థుల ఫోటోతో కూడిన క్యాలెండర్ను చూసి ఎమ్మెల్యే బాగుందన్నారు.పాఠశాల అభివృద్ధికి తోడ్పడిన గ్రామ సర్పంచ్ చాడ తిరుపతి రెడ్డి ని,పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ను ఈ సందర్భంగా అభినందించారు.అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రధానోపా ధ్యాయులను అడిగి తెలుసుకుని 80 మంది విద్యార్థులకు గాను ఈరోజు హాజరైన విద్యార్థులు సంఖ్య 77 అని తెలుసుకుని విద్యార్థుల హాజరుపట్ల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు.