నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నూతన సంహాత్సరం 2025-26 క్యాలెండర్ ను మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మంగళవారం ఆవిష్కరణ చేశారు.ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తుల ఐక్యత కోసం మోకుదెబ్బ సంఘం కృషి చేస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆర్ధిక, రాజకీయంగా గౌడులు ఎదిగేందుకు పాటుపడుతుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థలలో గౌడ కులస్తులు పోటీ చేసి తమ సత్తా చాటాలని రమేష్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సొల్టీ సారయ్య గౌడ్,మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోడిశాల సదానందం గౌడ్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లా ల అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, తోటకూరి రాందాస్ గౌడ్, ముంజాల రాజేందర్ గౌడ్,రాష్ట్ర నాయకులు రామగోని సుధాకర్ గౌడ్ శీలం వీరన్న గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్, మచ్చిక రాజు గౌడ్,రడం శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బోడిగే మల్లేశం గౌడ్, కొండి రాము గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పంజాల వెంకట్ గౌడ్, జేఏసీ నాయకులు వేముల రవి గౌడ్, వల్గుల రవీందర్ గౌడ్, జిల్లా కోశాధికారి మర్ద గణేష్ గౌడ్, యూత్ అధ్యక్షులు మర్ద సతీష్ గౌడ్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాంపల్లి వెంకట్ గౌడ్, చెన్నారావుపేట, దుగ్గొండి అధ్యక్షులు గోడిశాల మల్లయ్య గౌడ్, తడుక కొమురయ్య గౌడ్, ముంజాల సంజీవ్ గౌడ్కు, కక్కేర్ల అశోక్ గౌడ్ ,సోషల్ మీడియా మండలం అధ్యక్షులు తాళ్లపెళ్లి రాము గౌడ్, సొల్టీ సాంబయ్య గౌడ్,గుండెబోయిన శివకోటి గౌడ్, నాగరాజు గౌడ్, గోడిశాల గిరినాద్ గౌడ్, ఊడ్గుల సునిల్ గౌడ్, రాకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.