చిట్యాల, నేటి దాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం రోజున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చిట్యాల శాఖ ఆధ్వర్యంలో నాలుగు మండలాల స్థాయి కీడోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని , క్రమశిక్షణతో చదువుకుంటూ క్రీడల్లో పాల్గొనాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని, ఉద్యోగాల్లో క్రీడలు కూడా భాగమే అని చదువు ద్వారా ఆటల ద్వారా కన్న తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలని అన్నారు అనంతరం క్రీడాకారులకు క్రీడా దుస్తులను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధువంషి కృష్ణ స్పాన్సర్ చేసిన దుస్తులను ఎమ్మెల్యేగా చేతుల మీదుగా పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో గంగాధరి రాజు, ఏబీవీపీ విభాగ సంఘటన మంత్రి కుంట హర్షవర్ధన్, చిట్యాల సిఐ,డి మల్లేష్ యాదవ్, జిల్లా యువజన శాఖ క్రీడా అధికారి చిర్రా రఘుగౌడ్, మండల వైద్యాధికారి మౌనిక, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ కాంగ్రెస్ జిల్లా నాయకులు చిలుకల రాయకుమురు, కాంగ్రెస్ మండల జిల్లా నాయకులు ఇన్చార్జ్ హెడ్మాస్టర్ శ్రీరామ్ రఘుపతి ఫిజికల్ డైరెక్టర్లు , ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ ఇన్చార్జి వేల్పుల రాజ్ కుమార్. ఏబీవీపీ కార్యకర్తలు , నాలుగు మండలాల క్రీడాకారులు పాల్గొన్నారు.