ప్రచారంలో పాల్గొన్న ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి జ్యోతి

మీరే మా బలం బలగం

పరకాల నేటిధాత్రి

పదేండ్ల ప్రస్థానంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధ్దిని ఆదరించి పట్టం కట్టాలని,మా బలం బలగం నియోజకవర్గ ప్రజలేనని పరకాల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి,ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి అన్నారు.మంగళవారం హనుమకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురం గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.అడుగడుగునా పూలవర్షం కురిపించారు. మహిళలు మంగళహారతులతో అపూర్వ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా చల్లా జ్యోతి మాట్లాడుతూ పరకాల నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాల్లో ఎమ్మెల్యే అభివృద్ధి చేశారాన్నారు. మహిళల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు.రాష్ట్రంలో అనేక పథకాలతో అన్ని వర్గాలకు ఆర్థిక తోడ్పాటుకు చేయూతనిస్తున్నారని తెలిపారు.అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి మన అభ్యర్థి మీ అభిమాన నాయకుడు చల్లా ధర్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పులుపునిచ్చారు.గ్రామ మహిళలు మూకుమ్మడిగా కారు గుర్టుకు ఓటు వేసి మరింత గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు,బి.ఆర్.ఎస్. నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version