-అడిగినంత ఇస్తే అన్నీ మేం చూసుకుంటాం?
-అవసరమైతే ఖమ్మం జేసి రిపోర్ట్ తప్పని నోట్ పంపిస్తాం!
-జగన్ తప్పేం లేదని తేల్చేస్తాం?
-సమస్య నుంచి పూర్తిగా బైట పడేస్తాం?
-కేసులు నమోదు కాకుండా చూసుకుంటాం!
-మిల్లర్ జగన్తో అధికారుల బేరసారాలు?
-నేటిధాత్రి కథనంతో నీ పని ఔట్..? అంటూనే తూకమెంత అంటున్నారు?
-అన్ని శాఖ అధికారులు నేటిధాత్రి పేపర్ చూపించి జగన్ తో మంతనాలు?
-నేటిధాత్రి వార్త ఒక్కటి చాలు!
–ఖమ్మం జేసి చేసిన పని అందరూ హర్షిస్తుంటే హన్మకొండ అధికారులు బేరాలు చేసుకుంటున్నారు?
-నా ఒక్కడి వల్ల కాదు..మిగతా మిల్లర్లతో కలిపి ఇస్తానని జగన్ హామీ.
-సివిల్ సప్లయ్ హన్మకొండ అధికారుల దిగజారుడు తనానికి పరాకాష్ట!
-రైతులను మోసం చేసిన జగన్కు వత్తాసు పలుకుతున్నారు.
-జగన్ బేరం ఒప్పుకుంటే ఖమ్మం జేసిదే తప్పని నిరూపిస్తాం?
-ఆదర్శంగా వుండాల్సిన అధికారులు ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు.
-రైతులను మోసం చేసిన జగన్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
-మిల్లర్లు, అధికారులు కుమ్మక్కైతే ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు.
-మిల్లర్ జగన్ దోపిడీని ఎవరూ ఆపలేరు?
హైదరాబాద్,నేటిధాత్రి:
హన్మకొండలోని సివిల్ సప్లయ్ అధికారులు అవినీతిలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. శాఖ సాక్షిగా తప్పులుచేస్తారు. మిల్లర్లచేత తప్పులు చేయిస్తారు. తమ తప్పు లేని నిరూపించే ప్రయత్నం చేస్తారు. తప్పు చేసిన మిల్లర్లను తప్పిస్తారు. ప్రతిసారి మాకేమిస్తారని మోసం చేసిన మిల్లర్లకు అండదండలందిస్తారు. అందిన కాడికి దోచుకుంటారు. ఇదీ ప్రస్తుతం హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్ సప్లయ్ శాఖకు చెందిన అదికారుల ఘనకార్యమని అందరూ చెప్పుకుంటున్నారు. తాజాగా ఓ పెద్ద సంఘటన జరిగింది. తెలంగాణలో ఈ సీజన్లో సన్న వరి రకాలను రైతులు రికార్డు స్ధాయిలో పండిరచారు. అందులో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏకంగా 92శాతం సన్న వడ్లు పండిరచారు. దాంతో ఐకేపి సెంటర్లకు పెద్దఎత్తున వడ్లు వస్తున్నాయి. వాటిని మిల్లులకు పంపించడానికి ఆ జిల్లా అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో పొరుగున వున్న హన్మకొండ జిల్లా రైస్ మిల్లులకు ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ ఓ యాభై లారీల వడ్లను పంపించారు. వాటిని జాయింట్ కలెక్టర్ సూచించిన మిల్లులకు ఆ లారీలు చేరాలి. కాని ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ పంపిన మిల్లులకు ఆ వడ్లు చేరలేదు. హన్మకొండ జిల్లా సివిల్ సప్లై అదికారులకు అనుంగుడైన, అత్యంత సన్నిహితుడైన జగన్ అనే మిల్లులకు చేరాయి. ఇంత వరకు బాగానే వుంది. కాని ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ పంపిన వడ్ల బస్తాలకు, రైతులకు అందిన సొమ్ముకు మధ్య ఏదో తేడా కనిపించింది. దాంతో ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. ఖమ్మం నుంచి వచ్చిన 50 లారీల బస్తాలలో సుమారు 2000వేల బస్తాలను హన్మకొండ జిల్లాకు చెందిన మిల్లర్ జగన్ మాయం చేశాడు. ఈ విషయం పసిగట్టిన జాయింట్ కలెక్టర్ బస్తాల మాయంపై సంబందిత జగన్కు చెందిన మిల్లులకు తఖీదులు జారీ చేశారు. దాంతో జగన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. జగన్ మాయం చేసిన వడ్ల బస్తాల గురించి ఖమ్మం జాయింట్ కలెక్టర్కు ఎలా తెలిసిందని ఆరా తీశాడు. అసలు విషయం తెలుసుకున్నాడు. ఇరుక్కున్నానని అర్ధం చేసుకున్నాడు. ఇక్కడ జరిగిందేమిటంటే ఖమ్మం జాయింట్ కలెక్టర్ ప్రతి బస్తామీద దాని బరుకు చెందిన తూకం రాయించారు. ఈ విషయాన్ని మోసం చేసిన మిల్లర్ జగన్ పసగట్టలేదు. హన్మకొండ జిల్లాకుచెందిన సివిల్ సప్లయ్ అదికారులు గుర్తించలేదు. వచ్చిన లారీల నుంచి వడ్లు దించుకున్నామా? అందులో నుంచి 2వేల బస్తాలు మాయం చేశామా? అన్నట్లు జగన్ ఆత్రపడ్డారు. అడ్డంగా ఇరుక్కున్నాడు. ఇప్పుడు లబోదిబో మంటున్నాడు. తన బాధను హన్మకొండ సివిల్ సప్లయ్ అదికారుల ముందు పెట్టాడు. వెతకబోయిన తీర కాళ్లకు తగిలినట్లు హన్మకొండ సివిల్ సప్లై అదికారులు జగన్ను నేటిదాత్రి దినపత్రిక వుంచారు. ఈ విషయాన్ని నేటి దాత్రి దినపత్రిక ఎప్పుడో ప్రచురించింది. ఓ తరాజులో నేటి దాత్రి దినపత్రిక పెట్టినట్లు, మరో తూకంలో ఎంత ఇస్తావ్ అన్న ప్రశ్నలు పెట్టేశారు. తప్పు జరిగింది. జగన్ తప్పుచేశాడు. కాని మాకేం తెలియదు. జగన్కు వడ్లు ఇవ్వడం వరకే చూసుకున్నాం. కాని జగన్ వడ్లు మాయం చేసిన సంగతి మా దృష్టికి రాలేదని అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కేసు తమ మీదకు రాకుండా పూర్తిగా జగన్ మీదకు తోసేసే స్కెచ్ వేశారు. దాంతో జగన్ అదికారుల కాళ్లా వేళ్లా పడే పరిస్దితి వచ్చింది. ఇదే సరైన అవకాశం అనుకున్నారు. తప్పిస్తే ఎంతిస్తావ్ అనే బేరానికి వచ్చారు. తూకమెంత తూగుతామని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మేం అడిగినంత ఇస్తే తప్ప నిన్ను రక్షించలేమంటూ జగన్కే తెగేసి చెప్పేశారు. మేం అడిగింది తూకంలో వేస్తే అన్నీ మేం చూసుకుంటామని జగన్కు అదికారులు భరోసా ఇచ్చారు? హన్మకొండకు చెందిన అదే సివిల్ సప్లయ్ అధికారులు ఖమ్మం జేసి ఇచ్చిన రిపోర్టు తప్పని తాము నోట్ చేస్తామని, సమాదానం పంపిస్తామని జగన్కు చెప్పారు. ఈ విషయంలో జగన్ తప్పేం లేదని తేల్చేస్తాం. ఎలాంటి కేసు జగన్ మీదకు రాకుండా చూస్తామని హమీ ఇచ్చారు. ముఖ్యంగా నేటిధాత్రి దినపత్రికలో వచ్చిన కథనంతో జగన్ ఇక నీపని ఔట్ అంటూ బెదించారు. కేసులు ఎదొర్కొక తప్పదని భయపెట్టారు. నిన్ను లోపలికి పంపించేందుకు నేటి దాత్రి ఒక్క వార్త చాలంటూ జగన్కు చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. ఈ సంగతి తెలిసి అటు పొల్యూషన్ డిపార్టుమెంటు అధికారులు కదిలారు. ఇరిగేషన్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఏక కాలంలో మూడు శాఖల అధికారులు జగన్ను ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇంత దూరం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలు ఊరుకుంటాయా? వాటి పని అవి మొదలు పెట్టాయి. దాంతో ఇంత మంది అధికారులకు ఏక కాలంలో సమర్పణలు అంటే నా ఒక్కడి వల్లకాదని జగన్ అధికారులకు తేల్చి చెప్పాడు. నాతో పాటు వున్న అన్ని మిల్లులపై కూడ చర్యలుంటాయని అదికారులు సహకరిస్తే, వసూలు చేసి ఇస్తానని జగన్ హమీ ఇచ్చాడు. ఇది సివిల్ సప్లై శాఖతోపాటు, పొల్యూషన్, ఇరిగేషన్శాఖల దిగజారుడు తనానికి ఇది పరాకాష్ట అని ప్రజా సంఘాలు అంటున్నాయి. జగన్ బేరం ఒప్పుకుంటే ఏకంగా ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ దే తప్పని నిరూపిస్తామని అధికారులు అంటున్నారంటే ఎంతగా దిగజారి పోయారో అర్ధం చేసుకోవచ్చు. ఆదర్శంగా వుండాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అడ్డమైన దారులు తొక్కుతున్నారు. అడ్డంగా సంపాదనకు ఎగబడ్డారు. తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన వారిని కాపాడి సంపాదన పెంచుకుంటున్నారు. రైతులను నిండా మోసం చేసిన జగన్ను కాపాడే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. మిగతా మిల్లర్లతో మాట్లాడి అదికారులు చెప్పిన మూట సమర్పించడానికి జగన్ ఒప్పుకున్నట్లు సమాచారం. దాంతో హన్మకొండ అదికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మిల్లర్లు, అధికారులు కలిసి కుమ్మక్కైతే ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా కాపాడలేడన్న సామెతను నిజం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా మిల్లర్ జగన్ను ఎవరూ ఆపలేరు. ఈ విషయం ఖమ్మం అధికారులు తెలుసుకొని, వెంటనే రంగంలోకి దిగితే అసలు మోసగాళ్లంతా బైటకు వస్తారు. ఖమ్మం జేసి పంపిన రిపోర్టు తప్పని నిరూపించే ప్రయత్నం చేయకముందే అసలు నిజాలు బైట పెట్టి, చర్యలు చేపడితే అందరి బండారం బైటకొస్తుంది. హన్మకొండ సివిల్ సప్లై అదికారుల చేతి వాటమే కాదు, పొల్యూషన్, ఇరిగేషన్ అధికారుల అవినీతి బాగోతం అంతా బైటపడుతుంది.