క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు

డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ జై జవాన్ కాలనీ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ నేటి ధాత్రి డిసెంబర్ 25


ఉప్పల్ నియోజకవర్గ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మానవుడిలో ప్రేమ ,క్షమగుణం పెంపొందాలి అనే క్రీస్తు ఆలోచన విధానం నిత్యం ఆచరణనియం అని ఆయన చెప్పారు. ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఆయన తెలిపారు. విశ్వ మానవాళికి తన ప్రేమతత్వంతో వెలుగులు నింపిన కరుణమయుడని అన్నారు. శాంతియుత సమాజ స్థాపన కోసం తన రక్తం చిందించిన ధీశాలి యేసుక్రీస్తు ప్రభువు అన్నారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పర్వదినాన్ని ఉప్పల్ ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version