డిప్యూటీ తహసిల్దార్ కి రైతు సమస్యల మెమోరాండం

మంగపేట,నేటిధాత్రి

మంగపేట మండల తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ కి రైతు సమస్యల పై భారతీయ జనతా పార్టీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు లోడే శ్రీనివాస్ గౌడ్ మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు శ్రీ జాడి రామరాజు నేత పాల్గొనడం జరిగింది. రైతుల యొక్క సమస్యలు ప్రస్తావిస్తూ రైతులకు బే షరతుగా అందరికీ రెండు లక్షల రైతు రుణమాఫీ వర్తింపచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి గ్యారెంటీలలో రైతు కూలీలకు 12000 రూపాయల నగదుగా ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని, భూమి కలిగినటువంటి వారికి రైతు భరోసా కింద ఎకరానికి 15వేల రూపాయలు ఒక సంవత్సరానికి ఇస్తానని ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని, కౌలు రైతులకు సంవత్సరానికి 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పినా హామీని కూడా అమలు పరచాలని, ఈ తెలంగాణలో రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వర్తింపచేయాలని సత్వరమే ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ అమలుపరచాలని డిమాండ్ చేస్తూ మేమోరాండం నాయబ్ తహసిల్దార్ కి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు చీకట్ల ఏకస్వామి, జిల్లా కిసాన్ మొర్చా సభ్యులు మద్ధిని కృష్ణమూర్తి,మండల దళిత మోర్చా అధ్యక్షుడు రామటెక్కి సమ్మయ్య, మండల కోశాధికారి బుర సుధాకర్ మొదలగు వారు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version