భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘము ఎన్నికల్లో ఐఎన్టియుసి కార్మిక సంఘం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అశ్వారావుపేట ఎమ్యెల్యే జారే ఆదినారాయణను కలిసి ధన్యవాదాలు తెలిపిన ఐఎన్టీయుసి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రాజాక్.. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘము ఎన్నికల సమయంలో కార్మికులతో మమేకమై ప్రతిరోజు మీటింగ్ లలో పాల్గొన్నారు. సింగరేణిలో గుర్తింపు కార్మికుల సంఘము ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు 6 గ్యారెంటీ పథకంలను ప్రవేశపెట్టినది, వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.ఎంతో కాలంగా ఏదురుచుస్తున్న సింగరేణి కార్మికుల కోరికలను త్వరితగతిన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఐఎన్టీయుసి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రాజాక్ ఎమ్యెల్యే జారే ఆదినారాయణను కోరారు.