జైపూర్, నేటి ధాత్రి:
ఇటీవల మరణించిన జైపూర్ సింగరేణి థర్మల్ ప్లాంట్ ఇంజనీర్ బి. కిరీటి ఆత్మ శాంతి చేకూర్చాలని ఆకాంక్షిస్తూ ఎస్ టి పి పి టర్బెన్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు ఏం. గోపాల్ రావు డీజీఎం, డి. పంతుల నాయక్ డీజిఎం, పి. సురేష్ సేఫ్టీ, కె. ప్రసాద్ ఏం. రాకేష్, మహేష్ మరియు కార్మికులు, ఉద్యోగులు భీమారంలోనీ పేరల్స్ ఆఫ్ ఇండియా అనాధ ఆశ్రమంలో ఉన్న పిల్లలకు చదువుకు అవసరమైన పుస్తకాలు, పెన్సు, పెన్సిల్లు, ఎగ్జామ్ ప్యాడ్స్ మొదలగునవి అందజేశారు.తదుపరి పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేశారు. స్నేహశీలి, మంచి మిత్రుడు అయినటువంటి కిరీటి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నామని తెలిపారు.