కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సామాజిక సమానత్వం,సామాజిక న్యాయం కోసం మనస్మృతి పతుల దగ్దం

భద్రాచలం నేటి ధాత్రి

స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాలు స్వయం గౌరవ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో మనుస్మృతి దహన్ దిన్ సందర్భంగా మనుస్మృతి పతుల దగ్దం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా అలవాల రాజా పెరియార్ అధ్యక్షత వహించటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖ హేతువాది, సామాజిక ఉద్యమ నాయకులు డాక్టర్ భాను ప్రసాద్, అంబేద్కర్ రిస్ట్ ఈటె రాజేశ్వరరావు, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ముద్ద పిచ్చయ్య, బిఎస్పి నాయకులు ఏవి రావు, మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు మేకల లత,లు మాట్లాడుతూ…. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రారంభించిన అహింస ఉద్యమంలో డిసెంబర్ 25 భారతదేశంలో ఒక చారిత్రాత్మక సంఘటన అని, మను స్మృతి యొక్క మూలమైన వర వ్యవస్థ ద్వారా కులం సృష్టించబడిందని అన్నారు. మను స్మృతి గ్రంథాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న దహనం చేయడం జరిగిందని, మనువాదం పై దళితుల ఆగ్రహం వేదన యొక్క వ్యక్తి కరణ అని అన్నారు. డిసెంబర్ 25న మను స్మృతి దహన్ దిన్ ప్రతి సంవత్సరం జరుపుకుంటామని తెలిపారు. మనువాదుల బావాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, కేంద్ర హోమ్ మంత్రి హనీషా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు బహిరంగంగా పార్లమెంటు వేదికగా కించపరచడమే మను వాదుల కుటిలత్వం స్పష్టం అవుతుందని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన స్ఫూర్తిని కోనసాగించి ఈ మనవు గడి మానస పుత్రుల అన్యాయాలపై తిరుగుబాటు కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు గురుజల వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్మగిరి వెంకటేశ్వర్లు, కోట ప్రభాకర్, ఈసంపల్లి ముత్యం, కనుకుంట్ల రామకృష్ణ, ఎంఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు కొప్పుల నాగమణి, కోట ప్రశాంతి, కోట దీవెన, తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version