పరకాల పలు చర్చిలలో క్రిస్మస్ వేడుకలు

పరకాల నేటిధాత్రి
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పరకాల మున్సిపల్ పరిధిలో వెల్లంపల్లి రోడ్డులోగల నజరేతు ప్రార్ధన మందిరంలో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ
వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని క్రీస్తుబోధనలు ఆచరణీయమని,కరుణ,ప్రేమ,సహనం,దయ,త్యాగం,ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి మహోన్నతమైన సందేశాలుఅందించారు.అలాగే యేసుక్రీస్తు రాకడలో ఆయనతో నడిచే విధంగా ఉండాలని మానవాళిని సత్యం మార్గం జీవం అనే మార్గ నిర్దేశం చేశారని అన్నారు.


ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి,కౌన్సిలర్ ఏకు రాజు,పాస్టర్స్ పాల్,సదన్న మరియు సంఘ పెద్దలు సంఘస్తులు తదితరులు పాల్గొన్నారు.

1వ వార్డు సీఎస్ఐ సెయింట్ పాల్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు

క్రిస్టియన్ సోదరులు అత్యంత వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని స్థానిక సీఎస్ఐ సెయింట్ పాల్ చర్చిలో క్రిస్టియన్ సోదరులకు,సోదరిమణులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపి క్రిస్మస్ కేక్ కట్ చేసిన టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మడికొండ సంపత్ కుమార్,డాక్టర్.మడికొండ శ్రీను,బొచ్చు భాస్కర్ మడికొండ రాజు,బొట్ల వినయ్, మడికొండ సునీల్ గవస్కార్, పాస్ట్రేట్ ఛైర్మెన్ జాన్ పాల్, మిషనరీ ఇంచార్జి ప్రతుష్ బాబు,సంఘ నాయకులు బొచ్చు జాన్సన్,బండారి సుగుణాకర్ గ్రూపు చైర్మన్ , గ్రూపు కార్యదర్శి బొచ్చు జాన్సన్,కార్యదర్శి బి.థామస్,కమిటి సభ్యులు ప్రేంకుమార్,కమలాకర్,అశోక్, డాక్టర్ బాబు,చిన్ని,సంజయ్, స్వర్ణలత,పుష్ప,మంజుల,భాగ్య,సువర్ణ,ప్రమీల జాన్,జనార్ధన్,రవికుమార్,సతీష్,ఎం. జేమ్స్,కోర్నీలియస్,డాక్టర్ సామెల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version