జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం.!

జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి.

సమ్మెకు ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ సంపూర్ణ మద్దత్తు.

కారేపల్లి నేటి ధాత్రి

కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా రైతంగా కార్మిక విధానాలకి వ్యతిరేకంగా జులై 9న దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు కు ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ సంపూర్ణ మద్దత్తు ఇస్తుంది అని ప్రగతిశీల యువజన సంఘం. అఖిల భారత ఐక్య రైతుసంఘం డివిజన్ కార్యదర్శి. గుగులోతు తేజ నాయక్.మాట్లాడుతూ దేశవ్యప్తంగ జరుగనున్న సమ్మెకి మద్దత్తుగా ఖమ్మం జిల్లా సింగరేణి మండలం నాగయ్య గుంపు దుబ్బ తండ తదితర ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమం నాయకుడు.టియసిఐ. ధరావత్ సక్రు నాయక్. మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీ ల లాభం కోసం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ గా మార్చిందని కనీస వేతన చట్టం అమలు చేసి 26000 రూపాయలు ఇవ్వాలని కానీ కనీస వేతన చట్టం అమలు చేయడం లేదని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస పెన్షన్ 9000 వేల రూపాయలు ఇవ్వాలని అసంగటిత రంగ కార్మికుల వ్యవసాయ కార్మికుల అన్ని తరగతుల కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని రైతు మద్దత్తు ధర చట్టం అమలు చేయాలనీ ఉద్యోగుల పాత పెన్షన్ ని పునరుద్దరించాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమం లో కార్మిక సంఘలా సమైక్య టియుసి పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకుడు గుగులోత్ హరిదాస్ అఖిలభారత ఐక్య రైతు సంఘం మండల అధ్యక్షుడు పులకాని సత్తిరెడ్డి. అఖిల భారత ఐక్య వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు రావుల నాగేశ్వరావు
భూక్య నాగరాజు రాంప్రసాద్. తాటి పాపారావు. పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version