మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనను విజయవంతం చేయండి

బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
నేడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి జిల్లా కేంద్రానికి రానున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బల్గూరి తిరుపతి రావు తెలిపారు. బుధవారం మొగుళ్లపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొగుళ్ళపల్లి మండలంలోని పట్టభద్రుల ఓటర్లు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జోరుక సదయ్య, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు చదువు అన్నారెడ్డి, పిడిసిల్ల మాజీ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్ రెడ్డి, ఎల్లారెడ్డి పల్లె మాజీ సర్పంచ్ పెంతల రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చిలుక మారి శ్రీనివాస్ ముడుపు రవీందర్, బొల్లేని రవీందర్ రావు లాడే రాజు, దేవునూరి కుమార్ జగను బాపురావు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version