బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బూత్ ఏజెంట్ల విస్తృత స్థాయి సమావేశంను విజయవంతం చేయండి

#బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి

వెంకటాపూర్, నేటిధాత్రి:
భారత రాష్ట్ర సమితి ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశానుసారం వెంకటాపూర్ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజా ప్రతినిధులు, 100 ఓట్ల ఇన్చార్జిలు, బూత్ ఇన్చార్జిలు, బూత్ ఏజెంట్ల ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం మండల కేంద్రంలోని మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి స్వగృహ ఆవరణలో గురువారం ఉదయం 10గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ ముఖ్య అతిథులుగా మండల ఎన్నికల ఇన్చార్జ్ సాంబారి సమ్మరావు హాజరవుతారని తెలిపారు. కావున మండలంలోని ప్రజాప్రతినిధులు, ఎంపీపీ, జడ్పిటిసి, సర్పంచులు, ఎంపీటీసీలు, చైర్మన్లు, ముఖ్యంగా 100 ఓట్ల ఇన్చార్జీలు, బూత్ ఇన్చార్జీలు, బూత్ ఏజెంట్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ నామినేటెడ్ చైర్మన్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జాగృతి నాయకులు, మండల కోఆప్షన్ సభ్యులు, మండల అధికార ప్రతినిధి, డిసిసిబి డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, ఆత్మ డైరెక్టర్లు, రైతుబంధు మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, మాజీ మండల అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీ సభ్యులు మరియు పార్టీ కుటుంబ సభ్యులు ఉదయం 10గంటలకు సకాలంలో హాజరై ఈ విస్తృత స్థాయి సమావేశంను విజయవంతం చేయగలరని, మధ్యాహ్నం భోజన సదుపాయం కలదని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version