దుగ్గొండి మండలంలో అధిక ధరలకు మద్యం విక్రయాలు.

దుగ్గొండి మండలంలో అధిక ధరలకు మద్యం విక్రయాలు.

బెల్టు షాపులతో మందుబాబుల జేబులకు చిల్లు

పట్టించుకొని ఎక్సైజ్ శాఖ అధికారులు..

విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం..

నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి..

దుగ్గొండి,నేటిధాత్రి:

దుగ్గొండి మండల పరిధిలో ప్రభుత్వ అనుమతులతో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా బ్రాందీ షాపులు నడుపుతున్నారని ఆరోపణలను జోరుగా జరుగుతున్న సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని చర్చలు జరుగుతున్నాయి.గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న నిషేధిత బెల్టు షాపులను ఆసరగా తీసుకున్న మద్యం దుకాణాల యాజమాన్యాలు మద్యాన్ని అధిక ధరలకు బహిర్గతంగా అమ్ముకుంటున్నారని బాహుబాటంగా చెపుతున్నారు.

ఈ వ్యవహారం మొత్తం సంబంధిత ఎక్సైజ్ అధికారులు తెలిసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అని పలువురు ఆరోపిస్తున్నారు.దుగ్గొండి మండలంలో మూడు మద్యం దుకాణాలు ప్రభుత్వం నిర్వహించిన టెండర్ లను దక్కించుకొన్న కొందరు వ్యాపారులు దుగ్గొండి మండల కేంద్రంలో ఒక షాపు, గిర్నిబావిలో రెండు దుకాణాలు ఉన్నాయి.ఐతే మద్యం వ్యాపారస్తులు అధిక కాసులకు కకృత్తిపడి సిండికేట్ గా మారి బెల్టు షాపులకు అధిక ధరలకు మద్యాన్ని అమ్ముకుంటున్నారని పలువురు తెలుపుతున్నారు.

ఒక పుల్ బాటిల్ కు రూ.80 అదనపు వసూల్..

దుగ్గొండి మండలం పరిధిలోని ఆయా గ్రామాలను మూడు మద్యం దుకాణాల యాజమాన్యాలు మూడు భాగాలుగా విభజించుకున్నారు.వారు నిర్ణయించుకున్న గ్రామాలకు సంబంధించిన బెల్టు షాపుదారులు వారు నిర్ణయించుకున్న మద్యం దుకాణంలో ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాలని హుకుం జారీచేశారు.బీర్ బాటిల్,ఏదైనా క్వార్టర్ సీసాకు రూ.20 అదనంగా,అలాగే ఫుల్ బాటిల్ కు రూ.80 ఎక్కువ తీసుకొని బెల్టు షాపులకు విక్రహిస్తున్నారు.అలాగే మందు బాటిళ్లకు షాపుల వారిగా ప్రత్యేక స్టిక్కర్లు అంటించడం,మద్యం దుకాణాల యాజమాన్యాలనే ఎక్సైజ్ శాఖ పోలీసుల అవతారంలో బెల్ట్ షాపులపై రైడింగ్స్ చేయడం జరుగుతున్నదని పలువురు మందుబాబులు తెలుపుతున్నారు.గ్రామాల్లో సాధారణ కుటుంబాలు నిత్యం కూలినాలి చేసుకొని మద్యం సేదతీరేందుకు వెళ్లిన మందుబాబులకు అధిక రేట్ల వసూల్ లతో వారి జేబులకు చిల్లు పడుతున్నాయని పలువురు మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మద్యం దుకాణాలలలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న దుకాణాల యాజమాన్యాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు.

అధిక ధరల విక్రయాల పట్ల విచారణ చేయడతాం

*దుగ్గొండి మండలం పరిధిలోని నిర్వహిస్తున్న మద్యం దుకాణాలల్లో అధిక ధరలకు మద్యం విక్రయాల పట్ల విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి స్పష్టం చేశారు.గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించడం చట్టరీత్యా నేరం అని అన్నారు.

దుగ్గొండి మండలం ఉన్న మూడు మద్యం దుకాణాలల్లో ఎమ్మార్పీ రేట్లకే విక్రయాలు జరగాలి.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version