వ్యవసాయ కూలీల హక్కుల కోసం పోరాడుదాం.
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య.
కారేపల్లి నేటిదాత్రి
దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రధాని మోడీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు కూచించుకు పోతుంది అని. రూపాయి విలువ రోజురోజుకు దిగజారిపోయి సంక్షోభం వైపు పరుగులు తీస్తుందని. ఆదాని అంబానీ లాంటి కుబేరులు మరింత పెరిగిపోతూ సంపన్నులుగా మారిపోతున్నారని. పేదలు మాత్రం కటిక దరిద్రంలోకి నెట్టబడుతున్నారని అర్ధాకలితో అలమటిస్తూ అన్నమో రామచంద్ర అంటూ దేహరించాల్సిన పరిస్థితి ఈ దేశ ప్రధాని వ్యవసాయ కూలీలు రైతాంగ కార్మిక వర్గం లాంటి అన్ని వర్గాలపై తన దాడిని ఎక్కిపెట్టిందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకే ఎంఎస్ ఖమ్మం డివిజన్ ప్రధమ మహాసభ కారేపల్లి మండలం టేకులగూడెం గ్రామంలో అమరుడు లక్ష్మీనరసు నగర్ లో కూరాకుల నరసయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ మహాసభలో కార్యదర్శి కే లో పాపారావు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. వివిధ కారణాలతో రైతాంగ కార్మిక పోరాటాలలో అమృతం పొందిన అమరవీరులకు సంతాపం తెలియజేశారు.
మహాసభలో ఖమ్మం డివిజన్ అధ్యక్షునిగా కూరాకుల నరసయ్య ఉపాధ్యక్షులుగా చల్ల రాజు ప్రధాన కార్యదర్శిగా కే లోతు పాపారావు సహాయ కార్యదర్శిగా కోడెం సీతారాములు కోశాధికారిగా ఎస్ కె హుస్సేన్ బి తో పాటు 16 మందిని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది.
మహాసభ కొత్తగా తెచ్చిన విబిజి రాంజీ పథకాన్ని రద్దుచేసి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని.
200 రోజులు పని దినాలు కల్పించాలని.
ఎలాంటి షరతులు లేకుండా రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని. 12 వేల రూపాయల జీవన భృతి వెంటనే ఇవ్వాలని మహాసభ తీర్మానించనైనది. మార్చి 24 25 తేదీలలో కామారెడ్డిలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సభ అభిప్రాయపడింది.
ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి బందెల వెంకయ్య ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు సిపిఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి టి ఝాన్సీ టేకులగూడెం సర్పంచ్ గుమ్మడి సందీప్ ఏఐపీకే ఎంఎస్ నాయకులు చల్ల రాజు రావుల నాగయ్య మేక రామనాథం పొట్లపల్లి కృష్ణ కోడం సీతారాములు గుమ్మడి ఎర్రయ్య గుమ్మడి సరోజిని అనసూర్య సీత సమ్మక్క సత్తిరెడ్డి సక్రు రాము రమణ తదితరులు.
