బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం రోజున ఆలయ మండపంలో అయ్యప్ప స్వామి సహస్ర నామాల లోని ఒక మంత్రమైన ఓం వేట శాస్రే నమః అనే పదంతో అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములతో లక్ష సార్లు ఈ మంత్రాన్ని 1.30 గంటల పాటు ఏక ధాటిగా విరామం లేకుండా నామ స్మరణ శ్లోకాలు పారాయణం చేశారు ఈ కార్యక్రమంలో పండితులు కుటుంబరావు,అనిల్ కోటేశ్వర రావు,అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు సత్యం.రఘు.అనుదీప్, సాయి.రాజు. రాజేష్,స్థానిక భక్తులు పాల్గొన్నారు,అనంతం తీర్థ ప్రసాదాలు అందజేశారు.