సిపిఐ ఎంల్ మండల కన్వీనర్ గా కుమారస్వామి.
భూపాలపల్లి నేటిధాత్రి
సిపిఐ ఎంల్ లిబరేషన్ భూపాలపల్లి మండల కన్వీనర్ గా బుర్రి కుమారస్వామిని సిపిఐ ఎంల్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ శనివారం ప్రకటించారు. ఈసందర్బంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ ఎంల్ లిబరేషన్ ను బలోపేతం చేయడమే లక్ష్యం అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండకట్టే విధంగా ఉద్యమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం నూతన భూపాలపల్లి మండల కన్వినర్ బుర్రి కుమారస్వామి మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పని చేస్తానని,తన ఎన్నికకు సహకరించిన జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ కి కృతజ్ఞతలు తెలిపారు..