పద్మశాలి యువజన విభాగం జిల్లా అధ్యక్షునిగా కృష్ణ ప్రసాద్

నేటి దాత్రి కమలా పూర్(హన్మకొండ)

అఖిల భారత పద్మశాలి యువజన విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షునిగా కమలాపూర్ మండలంలోని మర్రిపెల్లిగూడెం గ్రామానికి చెందిన పోరండ్ల కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా పెగడపల్లి గ్రామానికి చెందిన కందికట్ల ప్రశాంత్ ను నియమిస్తూ అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం శనివారం నియామక పత్రాలను అందజేశారు. మర్రిపెల్లిగూడెం చేనేత సహకార సంఘం అధ్యక్షునిగా,కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ గా పనిచేసిన పోరండ్ల కృష్ణ ప్రసాద్ గత రాజకీయ అనుభవంను దృష్టిలో ఉంచుకొని పద్మశాలి యువజన విభాగాన్ని బలోపేతం చేయడానికి నూతనంగా అధ్యక్షునిగా నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు బచ్చు ఆనందం తెలిపారు.యువజన అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం,రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్,రాష్ట్ర కార్యదర్శి తౌటం రవీందర్ ,ప్రధాన కార్యదర్శి దాసి వెంకటేశ్వర్లు, కమలాపూర్ మండల అధ్యక్షులు బొప్ప శివశంకర్,పోరండ్ల రమేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు పద్మశాలీల సమస్యల సాధన కోసం కుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version