తంగళ్ళపల్లి నేటి ధాత్రి.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ నియోజకవర్గం పార్లమెంటు అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ని గెలిపించాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ బలపరిచిన కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ వివేకవంతుడు విజ్ఞానవంతుడు బహుముక ప్రజ్ఞశాలి అయినటువంటి బోయిన్పల్లి వినోద్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను అభ్యర్థించడం జరిగిందని ఎలాగైనా వినోద్ కుమార్ ని గెలిపించి కరీంనగర్లో పార్టీ గెలుపు కు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్ సీనియర్ నాయకులు జగత్ కుమార్ భానుమూర్తి రంగు ప్రసాద్ మండల యూత్ నాయకులు నెలల అనిల్ నవీన్ రెడ్డి బి ఆర్ ఎస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు కనకరాజు శ్రీకాంత్ రెడ్డి చందు దేవేందర్ లింగం అరవింద్ రమణ సంతోష్ శ్రీనివాస్ తిరుపతి స్వప్న తిరుమల్ పూర్ణచందర్ మనోహర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు