నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకపేట చెందిన గౌడ పారిశ్రామిక సహకార సంఘం మాజీ కార్యదర్శి
బూరుగు సాంబయ్య గౌడ్ భాగ్యలక్ష్మి దంపతుల షష్టిపూర్తి 60వ వివాహ మహోత్సవ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నాయకులు హాజరైనారు.ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకటేశ్వర్ గౌడ్,జిల్లా కార్యదర్శి శీలం వీరన్న గౌడ్,రాష్ట్ర నాయకుడు మద్దెల సాంబయ్య గౌడ్,గోపా నాయకుడు రామగోని సుధాకర్ గౌడ్, మోకుదెబ్బ పట్టణ కమిటీ కార్యదర్శి నాగరాజు గౌడ్,గౌడ సంఘ బొట్టు పెద్దమనిషి కందుకూరి వెంకటేశ్వర్లు గౌడ్ పాల్గొని షష్టిపూర్తి మహోత్సవ దంపతులను శాలువాలతో సన్మానం చేశారు.