చందాయిపేట సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్…
కొల్చారం( మెదక్) నేటి ధాత్రి:-
బిఆర్ఎస్ పార్టీ అధినేత ప్రస్తుతం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముచ్చటగా మూడోసారి విజయం సాధించడం ఖాయమని మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామ సర్పంచ్ స్వర్ణలత, మెదక్ జిల్లా బి ఆర్ఎస్ నాయకుడు భాగ్యరాజ్ ధీమ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాగ్యరాజ్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే ఆయనను గుర్తించి ముచ్చట మూడోసారి విజయం ఖాయమని ఆయన అన్నారు. ఏ ప్రభుత్వం చేయని పథకాలు బి ఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని తెలిపారు . ఆడపిల్లలకు మేనమామ లాగా కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ , కెసిఆర్ కిట్టు , ఒంటరి మహిళ పింఛన్లు , మిషన్ భగీరథ, దళిత బంధు పథకం, బీసీ బందు , గొల్ల కురుమలకు గొర్రెలు ఇప్పిచ్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ అని భాగ్యరాజ్ గుర్తు చేశారు.
* కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలే గెలిపిస్తాయి.. భాగ్యరాజ్..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే ఆయన గెలుపుకు పునాది అని మెదక్ జిల్లా బి ఆర్ఎస్ నాయకుడు బుడ్డగడ్డ భాగ్యరాజ్ తెలిపారు.