మైనార్టీలకు అండగా భారాస సర్కార్

 

బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేనిది! మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్
ఎండపల్లి (జగిత్యాల )నేటి ధాత్రి. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం,చెర్లపల్లి గ్రామంలో మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్ ఆద్వర్యంలో ముస్లిం-మైనార్టీ కాలనీ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశంలో జిల్లా లేబర్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సిగిరి ఆనంద్, మాజీ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ పడిదం నారాయణ, మైనార్టీ మండల శాఖ అధ్యక్షుడు మహ్మద్ సలీం, కో-ఆర్డినేటర్ సోల్లు రాజేష్, కాటు రవి హజరై భారాస సర్కార్ పాలనలో ముస్లిం-మైనార్టీల ఆత్మగౌరవం పెంపొందించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను అవగాహన కల్పిస్తూ ఇట్టి పథకాలను మనకు అందేలా నిరంతరం స్థానికంగా శ్రమిస్తున్న శాసనసభ్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ అని ఇలాంటి నాయకుడిని, పని చేసే ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించి భారీ మెజారిటీ దిశగా కారు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సయ్యద్ అలీ సాబ్, హైదర్, ఫకీర్, సాదుల్లా, చోటా హైదర్, మసూద్ అహ్మద్, సకీనా, హసీనా, అజీమా, గోరాభీ, సమీరా, నాయకులు జుంజిపెల్లి అంజయ్య, రాచమల్ల రవీంధర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version