కేసీఆర్ నే నాదేవుడు, కేసీఆర్ నా గుండెల్లో ఉన్నాడు.

కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి చేయ్యడమే మనందరి కర్తవ్యం.

కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపణి చేసిన ఎమ్మెల్యే రాములు నాయక్.

కారేపల్లి నేటి ధాత్రి.

పేదింట్లో పెళ్ళి అంటే ఆ కుటుంబానికి ఆర్ధికంగా ఎంతో భారమని ఆ భారాన్ని కేసీఆర్‌ తన భుజంపై వేసుకున్నారని వైరాఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ అన్నారు. శనివారం కారేపల్లిలోని వైఎస్‌ఎన్‌ గార్డెన్‌లో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్బంగా తహసీల్ధార్‌ వి. సురేష్.ఎంపిడివో చంద్రశేఖర్.కారేపల్లి ఎస్సై పుష్పాల రామారావు.,మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్ ఆధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిధిగా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు దేశానికి మార్గదర్శకంగా మారాయన్నారు. నాకు టికెట్ ఇవ్వన
కున్న బాధ లేదన్నారు. కేసీఆర్ నాకు దేవుడని, ఆయన నా గుండెల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ మాట నాకు బాటని, కేసీఆర్ ను మూడోసారి సీఎంగా చేసెటందుకు మనమందరం సైనికుల్లా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల జీవనంలో మార్పుకు తపిస్తున్న నేత కేసీఆర్‌ అని కొనియాడారు. కమ్యూనిస్టుల కూడు, గూడు, గుడ్డ ప్రణాళికను కేసీఆర్‌ అమలు చేసి చూపుతున్నారన్నారు. తెలంగాణ ప్రజల కోసం ప్రవేశపెట్టిన పధకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్‌ సారధ్యంలోని బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. మోడీ వచ్చి తెలంగాణలో నిలబడిన బీజేపీని ప్రజలు విశ్వసించరన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ వైరాతో కలుపుకోని 100 సీట్లు గెలుపుతో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్నారు. కారేపల్లి మండలంలో 52 మంది లబ్ధిదారులకు రూ.52,06,032 విలువైన చెక్‌లను 10 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 4,13500 విలువైన చెక్కులను అందజేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ మాలోత్‌ శకుంతల, కిషోర్ .జడ్పీటీసీ వాంకుడోత్‌ జగన్‌, సొసైటీ చైర్మన్ దుగ్గినెని శ్రీనివాస్ రావు, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఆత్మకమిటీ మాజీ చైర్మన్‌ ముత్యాల సత్యనారాయణ, సీనియర్ నాయకులు తోటకూరి పిచ్చయ్య, మాజీ మండల కార్యదర్శి అజ్మీర వీరన్న, బత్తుల శ్రీనివాస్, సంత ఆలయచైర్మన్ అడ్డగోడ ఐలయ్య, సోసైటీ ఉపాధ్యక్షులు దారావత్‌ మంగీలాల్‌, దిశ కమిటీ సభ్యులు సర్పంచ్ బాణోత్ కుమార్, సర్పంచ్ లు మాలోత్ కిషోర్, అజ్మీర అరుణ సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు భూక్యా రంగారావు, గుగులోత్ పద్మ, ఆదెర్ల స్రవంతి, కుర్సం సత్యనారాయణ, మౌనిక, బాణోత్ బన్సీలాల్, ఆదినారాయణ, బిజ్జ రాము, కల్తీ భద్రమ్మ, , శంకర్, ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు దారావత్‌ పాండ్యానాయక్‌, ఇమ్మడి రమాదేవి, బాణోత్ రమేష్, శంకర్, మూడ్ జ్యోతి, శివరాత్రి పార్వతి అచ్చయ్య, కో ఆప్షన్ మెంబర్ ఎండి అనిఫ్‌, ఎస్ కే షాపి. మండల మహిళ అధ్యక్షరాలు బాణోత్ పద్మావతి, సోసైటీ డైరక్టర్లు తోటకూరి రాంబాబు, మర్సకట్ల రోషయ్య, డేగల ఉపేందర్‌, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాంకుడోత్ నరేష్, మండల ఉపాధ్యక్షరాలు పప్పుల నిర్మల, నాయకులు అడపా పుల్లారావు, ఆదేర్ల రామారావు. చెవుల చందు, పిల్లి వెంకటేశ్వర్లు, షేక్ గౌస్ పాషా, ఉపసర్పంచ్ భూక్య చాందిని, యువజన నాయకులు ఎర్రబెల్లి రఘు, బాణోత్ కోటి, గుగులోత్ హారు, వీరన్న(చక్రం), జాల సాంబ, కరణ్ సింగ్, అంగోత్ మత్రు, గుగులోత్ మంగ్య, కల్తీ అరుణ్, వాంకుడొత్ సకృ, జర్పుల చందర్, గుగులోత్ రమేష్, సతీష్, ఆఫీస్ ఇంచార్జి తోగరు శ్రీను, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version