బలహీన వర్గాలకు న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం.

# ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రవీందర్ రావు

నర్సంపేట,నేటిధాత్రి :

దేశంలో భారత రాజ్యాంగం,రక్షించబడాలన్న, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగాలన్న,కాంగ్రేస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్,జిల్లా అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు అన్నారు.మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలోని కమలాపురంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం కార్యక్రమాన్ని జిల్లా అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఇప్పుడు అధికారంలో బీజేపీ ప్రభుత్వం దేవుళ్లు పేరు చెప్పి మత కలహాలు సృష్టిస్తున్నారని, దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి అంతే కానీ రాజకీయం కోసం దేవుళ్లను వాడుకోవటం దుర్మార్గమని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ త్యాగాల కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ ఈ సారి ప్రధాన మంత్రి కావాల్సిందే అని తేల్చి చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్తినేని వెంకన్న,కంచు రవి, కంచర్ల వెంకన్న, సారంగం, సోమయ్య, యాదగిరిలతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version