జుక్కల్ నియోజకవర్గం లో బస్ డిపో ఏర్పాటు చేయుటకై వినతి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి నేటి ధాత్రి:
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ని మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి పనుల కొరకై విన్నపించారు.
ఈసందర్బంగా ఎమ్మెల్యే జుక్కల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, నియోజకవర్గంలో ఒక బస్ డిపో అవసరం చాలా ఉందని నియోజకవర్గానికి మహారాష్ట్ర మరియు కర్ణాటక సరిహద్దు ఉండడం వల్ల మూడు రాష్ట్రాల ప్రజలు కూడా రాకపోకలను కొనసాగిస్తారని దానివల్ల నియోజకవర్గ ప్రజలకు రవాణా సౌకర్యంతో పాటు ఆర్టీసీకి కూడా మంచి లాభాలు ఉంటాయని కావున బస్ డిపో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.