పర్యటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలి

కోటగుళ్ళు, గణపసముద్రం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి

నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి

పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

సాస్కి పథకంలో చేపట్టే పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ, కార్యదర్శి పురావస్తు శాఖ డైరెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు.

కోటగుళ్ళు, గణపసముద్రం సందర్శన

అభివృద్ధి ప్రణాళికలపై అధికారులను అడిగి తెలుసుకున్న స్మిత సబర్వాల్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో జిల్లాలో ముఖ్య పర్యాటక ప్రాంతాలైన కోటగుళ్ళు గణప సముద్రం సరస్సు అభివృద్ధికి ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ, కార్యదర్శి పురావస్తు శాఖ డైరెక్టర్ స్మిత సబర్వాల్ అన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా పక్షాన ఆమెకు ఘన స్వాగతం పలికి మొక్కను అందజేశారు.సోమవారం ఆమె పర్యటకశాఖ ఎండి ప్రకాష్ రెడ్డి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటకశాఖ, పురావస్తు శాఖ అధికారులతో కలిసి కోటగుళ్లను మొదట సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయ విశిష్టత ఆలయానికి సంబంధించిన భూముల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాస్కి పథకంలో కోట గుళ్లు గణప సముద్రం సరస్సు చేర్చడం జరిగిందని అందుకు కేటాయించిన నిధులతో త్వరితగతిన పనులు చేపట్టి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలన్నారు. మంజూరైన నిధులతో చేపట్టే పనులకు ప్రణాళికలు సిద్ధం చేసి తమకు తెలపాలన్నారు. కొటగుళ్ళు గణపసముద్రం అభివృద్ధి కోసం తయారుచేసిన నమూనాలను అధికారులు ఆమెకు చూపించి వివరించారు. ఈ సందర్భంగా కోటగుళ్లు ఆలయం పక్షాన ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ఆమెను ఘనంగా సన్మానించి ఆలయ చిత్రపటాన్ని కలెక్టర్ చేతుల మీదుగా బహుకరించారు. అనంతరం అధికారులతో కలిసి గణప సముద్రం సరస్సు కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా కట్టపై నిర్మించే రోడ్డు, కాటేజీలు బోటింగ్ తోపాటు సాస్కీ పథకంలో చేపట్టే పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం హెరిటేజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లక్ష్మీ
పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజనీర్స్ జనరల్ మేనేజర్, ప్రాజెక్టు కన్సల్టెంట్స్ సత్యనారాయణమూర్తి క్షేత్ర కన్సల్టెన్సీ, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు డాక్టర్ హెచ్ ఆర్ దేశాయ్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్, డాక్టర్ రోహిణి పాండే, అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్, ఎం నవీన్ కుమార్
వరంగల్ సబ్ సర్కిల్ ఇంచార్జి,
డైరెక్టర్ హెరిటేజ్ తెలంగాణ, రాములు నాయక్, డిప్యూటీ డైరెక్టర్
మల్లు నాయక్, అసిస్టెంట్ డైరెక్టర్ వరంగల్ నర్సింగ్, అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజనీరింగ్), ఆర్డీఓ వెంకటేష్ , పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజనీర్స్ డి ఈ ధనరాజ్, పర్యాటక శాఖ తరపున డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ భూపాలపల్లి ఇరిగేషన్ ఈఈ బసవ ప్రసాద్ గౌడ్, గణపురం తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి ఎంపీడీవో ఎల్ భాస్కర్ అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్, రెవిన్యూ, పంచాయితి రాజ్, ఇరిగేషన్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version