ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు పత్రికలు

జర్నలిజం విభాగాధిపతి డా. సంగని మల్లేశ్వర్

నేటిధాత్రి, వరంగల్

ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రజల పక్షాన నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం అధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్ చెప్పారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగంలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జర్నలిజం విభాగం విభాగాధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ ఎప్పుడు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలపై దృష్టి పెడతాడన్నారు. ఇది ఒక విలేకరిగా వారి బాధ్యత అని,సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలపై రాస్తున్న కథనాలు జీర్ణించుకోలేని పాలకులు భౌతిక దాడికి దిగడం ముమ్మాటికి అది సమాజం పై దాడే అన్నారు. 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్సు మేరకు 1966 నవంబర్ 16వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రిక దినోత్సవం నిర్వహించు కుంటున్నామన్నారు. పత్రికలు నిజాన్ని నిర్భయంగా, స్వేచ్ఛగా, రాజకీయాలకు అతీతంగా రాయాలని అన్నారు. ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న జర్నలిస్ట్ లపై దాడులు,భద్రత వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతున్నాయన్నారు. ఇలా అనేకమంది జర్నలిస్టులపై రోజు రోజుకు ఏదో ఒక చోట దాడులు జరుగుతునే వున్నాయన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల నాయకులు,ప్రజలు కోరుకుంటున్నారని, ఎన్నో కష్టాలకోర్చి అనేక వాస్తవిక స్థితిగతుల సమాచారాన్ని ప్రజలకు చేరవేసే జర్నలిస్టులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందన్నారు. కానీ అదేస్థాయిలో వారు విధి నిర్వహణలో
భాగంగా ఎన్నో ఒత్తిళ్లను తట్టుకోవాల్సి ఉంటుంది.తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిజ నిజాలను నిగ్గు తేల్చి ప్రజల ముందుంచుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో జర్నలిజం విభాగం అధ్యాపకులు డా. శ్రీకాంత్ యాదవ్, కంజర్ల నర్సింహా రాములు, డా. వంగాల సుధాకర్, డా. మోటె చిరంజీవి,ఈర్ల సురేందర్, జర్నలిజం విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version