జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా పత్రికా రంగానికి శుభాకాంక్షలు తెలిపిన

– చందాయి పేట తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్….

– మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్…..

కొల్చారం (మెదక్) నేటిధాత్రి :-

పత్రికా రంగం సమాజానికి అద్దంగా నిలుస్తుంది. నిష్పక్షపాతంగా, ధైర్యంగా, నిజాయితీతో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయుల కృషి అసమానది, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను సమన్వయంతో ప్రజలకు అందించి, సమాజం చైతన్యవంతం కావడానికి సహాయపడుతున్న పాత్రికేయులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న చేగుంట మండలం చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్, పత్రికా రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం నిరంతరం పగలు రాత్రి అనక పనిచేస్తున్న పత్రిక విలేకరులకు నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఇంకా ప్రజల సమస్యల కోసం, ప్రజా సమస్యల కోసం నిరంతరం మీ కృషి ఉండాలని బుడ్డ భాగ్యరాజ్ అన్నారు. దుర్గామాత రియల్ ఎస్టేట్ తరఫున కూడా పత్రిక సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఆయన అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version