అభివృద్ధిని చూసి బిఅర్ఎస్ పార్టీలోకి చేరికలు

దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి పార్టీల 45 కుటుంబాలు చేరికలు
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి :

సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిఅర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.దుగ్గొండి మండలంలోని మహ్మదాపురం గ్రామం నుండి కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి టిఆర్ఎస్ లో 45 కుటుంబాలు నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో నియోజకవర్గ, నాయకులు వంగేటి అశోక్ కుమార్.ఎంపిటిసి చింత లావణ్య యుగేందర్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆడెపు రాజు అధ్వర్యంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు.ప్రతీ కార్యకర్తలు కంటికి రెప్పల కాపాడుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.మహమ్మదాపురం గ్రామంలో అంతర్గత,లింక్ రోడ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో చేరుకున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో గంట శ్రీనివాసరెడ్డి, రేగుల స్వామి, వంగ రవి యాదవ్, సురావు కృష్ణ, రేగుల శివ, కొండ్రోజు శ్రీనివాస్, ఎద్దు శ్రీనివాస్, ఎద్దు రమేష్, ఆడెపు సుమన్, సూచన నగేష్, ఊడపల్లి రాజేందర్, పెరుమాండ్ల విష్ణు, పర్ష సందీప్, పెరుమాండ్ల సంపత్, బొల్లు కొండ సంతోష్, బరికెల మహేందర్జ్ మిట్టపల్లి శివ, మిట్టపల్లి వినయ్, మిట్టపల్లి ఉదయ్, మిట్టపల్లి సింధు, మిట్టపల్లి నవీన్, మిట్టపల్లి పవన్, మాస రాకేష్, మాస నితిన్, కాకి నరేష్, కాకి నవీన్, దామర చందు, బరిగెల కొమరమ్మ, గణిపాక అరుణ, కొంపెల్లి శోభ, మాస చంద్రశేఖర్, మాస కళ్యాణ్ ,నర్మద ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్పిసి చైర్మన్ చొప్పరి అశోక్, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి మురారి కుమారస్వామి, ఉపాధ్యక్షులు బొడిగ అనిల్, మిట్టపెల్లి సుధాకర్, కోశాధికారి కొండ్రోజు చంద్రమౌళి, సీనియర్ నాయకులు గంట మైపాల్ రెడ్డి, చింత బాబు, మారెల్లి రాజు, వెంకటయ్య,క్లస్టర్ బాధ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version