చందుర్తి నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ మరియు జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్, సమన్వయంతో నిరుద్యోగ యువతీ యువకుల కొరకు జాబ్ మేళా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాగారం సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్, ప్రతిమ ఫౌండేషన్ శ్యామల, చందుర్తి మండల కోఆర్డినేటర్ శ్రీలత,పరమేష్ లు హాజరై ఉచిత శిక్షణ మరియు ఉద్యోగావకాశాల గురించి వచ్చిన వారికి వివరించారు ఇట్టి అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ యువతి యువకులు, మరియు కార్యక్రమ నిర్వాహకులు మంజుల, గంగాధర్,మదు,సతీష్,సుధాకర్,గంగాధర్,ముకేష్,శ్రీనివాస్,సాయికృష్ణ, శివ, గంగమల్లు, చరణ్, శంకర్,నరేష్,ప్రశాంత్,వంశీ,సాగర్,
శ్రీనివాస్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు