మహాత్మ జ్యోతిబా ఫూలే అవార్డు అందుకున్న జింజిపెల్లి శ్రీనివాస్!!!

ఉపాధ్యాయుడికి గొప్ప గుర్తింపు.!!
విద్యాభివృద్ధికి కృషి చేసినందుకు గాను ఈ అవార్డ్ అన్న నల్ల రాధాకృష్ణ!!
ఎండపల్లి నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చెర్లపల్లెకు చెందిన ఉపాధ్యాయుడు జింజిపెల్లి శ్రీనివాస్ మహాత్మ జ్యోతిబా ఫూలే” జాతీయ అవార్డు – 2024 ను అందుకున్నారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సాయంత్రం జరిగిన బహుజన సాహిత్య అకాడమీ ఏడవ తెలంగాణ రాష్ట్ర కాన్ఫరెన్స్ లో జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు యం. యం. గౌతమ్ చేతుల మీదుగా శ్రీనివాస్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.
ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మట్లాడుతూ జుంజిపెల్లి శ్రీనివాస్ గత 15 సంవత్సరాలుగా ధర్మారం, ఎండపల్లి మరియు వెల్గటూర్ మండలాల పరిధిలో ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఉన్నత విద్య చదివే విద్యార్థులకు అండగా నిలిచి వారికి పలు సలహాలు సూచనలు చేయడంతో పాటు తన సహాయ సహకారాలను కూడా అందించాడు. ఉపాధ్యాయుడిగా ఆయన ఎస్.సి, ఎస్.టి, బి.సి, మరియు మైనార్టీల విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డ్ ను అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కు చర్లపల్లి గ్రామ ప్రజలతో పాటు మండల పరిధిలోని పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version