అన్నం రాజమల్లు నీకు తగునా…

సీతంపేటలో ఇటు ప్రభుత్వ భూమి అటు ఎస్సారెస్పీ భూమి కబ్జా చేసిన ఘనుడు

చోద్యం చూస్తున్న అధికారులు…
ఆగ్రహ వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

ముత్తారం :- నేటి ధాత్రి

అన్నం రాజమల్లు నీకు తగునా అంటున్నారు… మండలంలోని సీతంపేట గ్రామ ప్రజలు… గ్రామస్తుల కథనం ప్రకారం సీతంపేటలో ఇటు ప్రభుత్వ భూమిని… అటు ఎస్సారెస్పీ భూమి ని కబ్జా చేసిన అన్నం రాజమల్లు ఆ ప్రభుత్వ భూమి పైనే కన్నేసి కాజేస్తున్నాడు. సీతంపేట లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన స్మశాన వాటికను కూల్చేందుకు నానా ప్రయత్నం చేస్తూ ఫిర్యాదులు చేసిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పిర్యాదు దారులు వాపోతున్నారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఎదురుగానే ఉన్న తన ఇంటిని ఏకంగా ఎస్సారెస్పీ కెనాల్ ను దర్జాగా కబ్జా చేసి ఇంటిని నిర్మించాడని, రైతులకు ఉపయోగపడే ఎస్సారెస్పీ కెనాల్ ను కబ్జా చేశాడని రాజమల్లుపై ఇదివరకే గ్రామస్తులు ఫిర్యాదు చేయగా
అధికారులు చోద్యం చూస్తున్నారని గ్రామ ప్రజలు అధికారుల పై
ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. రాజమల్లు ఇచ్చే అమ్య ఆమ్యాలకు లాలూచీపడి అధికారులు కబ్జా చేసిన భూములను అతని నుంచి స్వాధీన తీసుకోవాల్సింది పోయి, రాజమల్లు కే వత్తాసు పలుకుతూ, తప్పుడు పత్రాలు సృష్టించి గ్రామస్తులను, రైతులను ఇబ్బందులు పెడుతున్నారని గ్రామ ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే అన్నం రాజమల్లు అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని, ఎస్సారెస్పీ భూమిని స్వాధినం చేసుకొవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేకుంటే జిల్లా కలెక్టర్ కు మరోసారి ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.

మంథనిలో అక్రమ నిర్మాణమే

మంథని పట్టణంలో కూడా అన్నం రాజమల్లు గతంలో గ్రామ పంచాయతీ భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, అందులో దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఇల్లు నిర్మించాడని ఆ ఇంటికి ఇప్పటికి కూడా సరైన ధ్రువపత్రాలు లేవని గ్రామస్తులు తెలిపారు. మంథనిలో అక్రమంగా నిర్మించిన ఇల్లు పై కూడా త్వరలో ఫిర్యాదు చేయనున్నట్టు గ్రామస్తులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version