జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
భూపాలపల్లి నేటిధాత్రి
పకడ్బందీగా రెండు పడకల ఇళ్ళ దరస్తుల విచారణ చేపట్టాలనీ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.బుధవారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో
సంబంధిత విచారణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ, భూపాలపల్లి పట్టణంలో రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపు లో అవకతవకలు లేకుండా పక్కగా విచారణ చేపట్టాలని అన్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ఇండ్లు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.విచారణ పూర్తయిన తర్వాత 35 అంశాలతో కూడిన ధరకాస్తు దారుల వివరాలు భద్రపరచి విచారణ అనంతరం ధరకాస్తు దారుల వివరాలు నోటీస్ బోర్డు లో పెట్టాలన్నారు.
వేషాల పల్లి రెండు పడకల ఇళ్ళ నిర్మాణం లో భూములు కోల్పోయిన వారిని సత్వరం గుర్తించి వారికి లబ్ధి జరిగేలా చూడాలన్నారు.
ఒక్కోకొక్క ధరకాస్తు దారులు రెండు సార్లు
మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారిని గుర్తించి వాటిలో ఒకటి తొలగించాలన్నారు.
ప్రతి ఒక్క దరఖాస్తుదారు ఇంటి వద్ద కు వెళ్లి పక్కగా విచారణ చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, విచారణ అధికారులు,మున్సిపల్ కమిషనర్ అనిల్ సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.