గ్రామపంచాయతీ కార్యదర్శి రత్నాకర్
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం నుండి పత్తిపాక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్నటువంటి సెంటర్ స్ట్రీట్ లైటింగ్ గత కొద్ది రోజులుగా వెలగడం లేదు రోడ్డుకు రెండు వైపులా వెలగవలసిన లైట్లు వెలగకపోవడంతో రోడ్డు అంధకారంగా తయారైనది రోడ్డుపై లైటింగ్ లేక రోడ్డు పై నడిచివెళ్లే వాళ్ళు చీకట్లో ఏ వాహనం వచ్చి మమ్మల్ని ఢీ కొట్టుతోందని భయంతో గురవుతున్నారు.అది గమనించిన గ్రామపంచాయతీ సిబ్బంది కార్యదర్శి తో చెప్పడం వల్ల వెంటనే స్పందించి గ్రామపంచాయతీ సిబ్బంది యాకయ్య,ప్రమోద్ ఆధ్వర్యంలో చెడిపోయిన విద్యుత్ బాక్సులు మార్పిడి చేసి ఈ రోడ్డుపై ఉన్నటువంటి సెంటర్ లైటింగ్ లో ఉండే లైట్లు రెండు వైపులా వెలిగేటట్టు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి , సిబ్బంది పాల్గొన్నారు.