మా కొద్దు.. ఈ ఇందిరమ్మ ఇళ్లు!
తలదాచుకునేందుకు గూడు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లు నీడనిస్తాయని ఆశప డ్డారు. కానీ వారి ఆశ నిరాశే అయింది.
- బిల్లులు సరిగా రాక రద్దు చేసుకుంటున్న లబ్ధిదారులు
- హనుమకొండ జిల్లాలో ముందుకు సాగని పథకం
- 9,860 ఇళ్లలో పూర్తయినవి 260, వివిధ దశల్లో ఉన్నవి 3,099
- పూర్తయిన డబుల్బెడ్రూమ్ ఇళ్లు సైతం కేటాయించని వైనం
హనుమకొండ: తలదాచుకునేందుకు గూడు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లు నీడనిస్తాయని ఆశప డ్డారు. కానీ వారి ఆశ నిరాశే అయింది. ఇండ్లు మంజూరైవారు ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో ఇళ్లు కట్టుకోవచ్చునని సంతోషపడ్డారు. తాముంటున్న గుడిసెలను తొ లగించి ఆ స్థలంలోనే ఇళ్లను మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి వారికి చు క్కలు కనిపిస్తున్నాయి. అటు ఇల్లు పూర్తికాక.. ఇటు ఉన్న నీడ కూడా పోయి రెంటికి చెడిన రేవడి చందంగా మారింది. వీరి పరిస్థితిని చూసిన మిగతా లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టడానికి జంకుతున్నారు. మరికొంత మంది తమకు మంజూరైన ఇళ్లు తమ వల్లకాదని రద్దు చేసుకుంటున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బిల్లుల చెల్లింపులో తీవ్రజాప్యం జరుగుతోంది. లబ్ధిదారులు మొదట తమ సొంత డబ్బుతో ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత దశల వారిగా బిల్లులను చెల్లిస్తారు. అయితే పునాదులు పూర్తయిన ఇళ్లకే సకా లంలో మొదటి విడత బిల్లు రావడం లేదు. అది వస్తే తప్పా లబ్ధిదారులు నిర్మాణం విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితి. బిల్లు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నామని లబ్ధిదారులు వాపోతు న్నారు. సాంకేతిక సమస్యలు, బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పలు వల్ల తొలి విడత బిల్లే పెండింగ్లో పడుతున్నది. శ్లాబ్ పనులు పూర్తయినా ఇళ్లకు బిల్లుల చెల్లింపులో ప్రాధాన్యత ఇవ్వాలన్న స్ప ష్టమైన ఆదేశాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరో పణలు వినవస్తున్నాయి. కొంత ఆర్థిక స్థోమత ఉన్నవారు ఇంటి నిర్మాణాలు చేపట్టినా వారి ఖాతాల్లో అనుకున్న సమయంలో బిల్లుపడకపోవడంతో ఎందుకు ఇంటి నిర్మాణం చేపట్టామా అని తలలు పట్టుకుంటున్నారు. బిల్లుల చెల్లింపు జాప్యంతో నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోయి ఇళ్ల నిర్మాణంలో ఆశించినంత పురోగతి కనిపించడం లేదు.
రద్దు చేసుకుంటున్న లబ్ధిదారులు
బిల్లులు సకాలంలో రావడం లేదని, పైగా ప్రభుత్వం ఇచ్చే రుణసాయం ఏ మూలకు సరిపోదని తెలిసి కొందరు లబ్ధిదారు లు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ఇళ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టకముందే తమకు వద్దని రద్దు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఎంపీడీవోలకు లిఖితపూర్వకంగా రాసిస్తున్నారు. ప్రతీ మండలంలో 15 నుంచి 20 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులను రద్దు చేయించుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లను మొదలు పెట్టిన తర్వాత లబ్ధిదారులు పడుతున్న కష్టాలను చూసి తమకు జ్ఞానోదమైందని, అందుకే ముందుగా జాగ్రత్త పడుతున్నామని చెబుతున్నారు.
