బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

వనపర్తి నేటిధాత్రి
వనపర్తి జిల్లా రెవల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో అవగహన కార్యక్రమం నిర్వహిం చారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మమ్మ ఐసిపిఎస్ కేసు వర్కర్ హాజరై మాట్లాడుతూ.ఫోక్సో చట్టం ద్వార బాలికలపై లైంగికంగా వేధింపులకు గురిచేసే వారికి 7 నుండి 20 సంవత్సరాల వరకు గరిష్టంగా జైలు శిక్ష పడే అవకాశం ఉందని అన్నారు . అదే విధంగా వనపర్తి జిల్లాలో బాలికల నిష్పత్తి ఘననీయంగా తగ్గుతుందిని ఆడపిల్లలను కాపాడుకోవడంలో భాగంగా అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని గర్భస్థ శిశువు నుండి 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిల కోసం నిరంతరాయంగా వారికి రక్షణగా చైల్డ్ హెల్ప్ లైన్ పనిచేస్తుందని తెలపారు. బాల్య వివాహలను అరికట్టడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా బాలబాలికల హక్కుల కోసం అమలు చేస్తున్న పథకాలు పటిష్టమైన రక్షణ చట్టాలతో బాలల హక్కులను కాపాడుతూ వారి ఎదుగుదలకు ప్రోత్సాహం అందుతుందని అందుకు ప్రతి ఒక్కరు గర్వపడి మరింత ఉత్సాహంగా ఉన్నత లక్ష్యాలను ఛేదించే విధంగా ముందుకు సాగాలని అందుకు ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిదంగా అమ్మాయిలకు మంచి స్పర్శ చెడు స్పర్శ పై పూర్తి అవగాహన కలిగి ఉండేలా అవగహన కల్పించి ఇతరులచే ఏదైనా ప్రమాదం అని గ్రహిస్తే వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సమచారం ఇచ్చే విదంగా ప్రోత్సహించాలన్నారు, బాలల హక్కుల పరిర్షణకు మరియు బాల్యవివాహాల నియంత్రణ కొరకై కృషి చేయాలని హాజరైన వారిచే ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో కెజీబీవీ ఇంచార్జి ఎస్ ఓ మహేశ్వరి ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version