ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మనువాద మతోన్మాదం

# బిజెపి మోడీ పాలనకు చరమగీతం పాడాలి
# ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట నేటిధాత్రి :

ప్రధాని మోడీపాలనలో దేశ ప్రజాస్వామ్యం,వ్యక్తిస్వేచ్ఛ,హక్కులు పెను ప్రమాదంలో ఉన్నాయని, ఎన్నికల లబ్ధి కోసం ఫాసిజాన్ని రెచ్చగొడుతూ మళ్లీ అధికారాన్ని చేపట్టేందుకు బిజెపి మోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు.కమ్యూనిస్టు కోఆర్డినేషన్ కమిటీ (సిసిసి) పిలుపుమేరకు ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ‘ముంచుకొస్తున్న మతోన్మాద మనువాద ముప్పు-లౌకిక శక్తుల పాత్ర’ అనే అంశంపై స్థానిక ఓంకార్ భవన్ లో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ జాతీయోద్యమ నేత గాంధీజీని చంపిన గాడ్సేను దేశభక్తుడిగా చిత్రీకరిస్తూ ప్రజాస్వామ్యాన్ని బిజెపి మోడీ ప్రభుత్వం అపహాస్యం పాలు చేస్తున్నదని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత రాజ్యాంగాన్ని మనువాద రాజ్యాంగంగా మార్చేందుకు ఫాసిజమును పెంచి పోషిస్తున్నదని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన మోడీ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి కార్మిక కర్షక హక్కులను కాలరాస్తూ దేశ సంపదను ఆదాని అంబానీ లాంటి కార్పొరేషన్లు కట్టబెడుతూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని కాపాడుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని మళ్లీ మోడీ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశ ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం వాటిల్లుతుందని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు లౌకిక శక్తులు అప్రమత్తంతో ముందుకు సాగాలని బిజెపి మోడీ చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఏఐఎఫ్డివై రాష్ట్ర ఉపాధ్యక్షులు మంద రవి, ఏఐకెఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుంబ బాబూరావు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర బాధ్యులు నాగెల్లి కొమురయ్య బిఎల్ఎఫ్ వరంగల్ తూర్పు కన్వీనర్ ఐతం నాగేష్ ఏఐసిటియు జిల్లా నాయకుడు ఎగ్గెని మల్లికార్జున్ యువజన సంఘం నగర నాయకుడు పరిమళ గోవర్ధన్ రాజు ఏఐఎఫ్డిడబ్ల్యు నగర నాయకులు అన్నెబోయిన ప్రేమలత అంగడి అనుష ఓరి రేణుక తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version