సిరిసిల్ల జిల్లాలో 2025-26 సంవత్సరమునకు గాను సాగు ప్రణాళిక ఉద్యాన శాఖ
జిల్లా ఉద్యాన శాఖ అధికారి కే.ఆర్. లత
సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి ):
సిరిసిల్ల జిల్లాలో 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి గాను ఉద్యాన శాఖ అందించే పథకాల ప్రణాళిక ఖరారైంది. నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్స్ ద్వార పామ్ ఆయిల్ చెట్లు నాటించడం, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా సూక్ష్మ సేద్యం, తుంపర్ల సేద్యం, శాశ్వత పందిరి నిర్మాణం ద్వారా కూరగాయల సాగు, సమీకృత అభివృద్ధి మిషన్ ద్వార పండ్ల తోటల పెంపకం, కూరగాయలు, పూల తోటల పెంపకం, మల్చింగ్, పాత తోటల పునరుద్ధరణ, , ఉద్యాన యాంత్రీకరణ, జాతీయ వెదురు మిషన్ ద్వారా తోటల చుట్టూ వెదురు చెట్లు పొలం సరిహద్దులపై నాటించడం కొరకు ఉద్యాన శాఖ కార్యాచరణ రూపొందించింది. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ , రాజన్న సిరిసిల్ల 2025-26 సం.లో అందించనున్న పథకముల వివరాలు నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం కింద ఆయిల్ పామ్ తోటలు పెంచుట.
ఈ పథకంలో ఒక అయిల్ పామ్ మొక్కకు ఖరీదు రూ.193, ఇందుకు గాను ఒక మొక్కకి రూ.20 మాత్రమే రైతు వాటా గా కట్టవలసి వస్తుంది. ఎకరానికి 50 మొక్కల నాటించబడును అంతర పంటలకు మరియు పంటల నిర్వహణ కొరకు ఎకరాకు 4,200 రూపాయలు 4 సంవత్సరాల పాటు చెల్లిస్తారు. 2025-26 సం.లో ఆయిల్ పామ్ సాగు కొరకు 2000 ఎకరాలు, భౌతిక లక్ష్యం కేటాయించడం జరిగింది.
సూక్మ సేద్య పథకము.ఈ పథకం క్రింద షెడ్యుల్ కులాలు / షెడ్యుల్ తెగలు – 100 % రాయితీ, మరియు సన్న కారు / చిన్న కారు రైతులకు 90%,ఇతర రైతులు – 80 % రాయితీ ఇవ్వబడును. రైతుల అందరికి G. S. T ( వస్తు సేవ పన్ను) వర్తించును 2025-26 సం.లో పండ్ల తోటలు , కూరగాయల తోటలకు మరియు ఇతర తోటలకు బిందు సేద్యం కొరకు 437 ఎకరాలు, తుంపర సేద్యం కొరకు 212 ఎకరాలు భౌతిక లక్ష్యం కేటాయించడం జరిగినది.
సమగ్ర ఉద్యాన మిషన్ పథకము.
ఈ పథకం క్రింద పండ్ల తోటల పెంపకానికి 50%, కూరగాయలు, పూల తోటల పెంపకానికి 40% మరియు
సబ్సిడీ ఇవ్వబడును. 2025-26 సం.లో డ్రాగన్ ఫ్రూట్ తోట కొరకు 12.50 ఎకరాలు, బొప్పాయి తోట కొరకు 22.50 ఎకరాలు, మామిడి తోట (High Density పద్దతిలో ) కొరకు 25 ఎకరాలు, జామ తోట (High Density పద్దతిలో ) 5 ఎకరాలు, కూరగాయల నారు కొరకు 87.50 ఎకరాలు, పూల సాగు 47.50 ఎకరాలు, సుగంద ద్రవ్యాల విత్తనాల కొరకు 17.50 ఎకరాలు, మామిడి తోటల పునరుద్దరీకరణ కొరకు 50 ఎకరాలు, మల్చింగ్ కొరకు 125 ఎకరాలు, భౌతిక లక్ష్యం కేటాయించడం జరిగింది . మరియు ఉద్యాన యాంత్రీకరణ పనిముట్లు పవర్ టిల్లర్లు, పవర్ వీడర్లు, పవర్ స్ప్రేయర్లు , బ్రష్ కట్టర్ల కు రాయితీ ఇవ్వబడం జరుగుతుంది..రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
ఈ పథకం క్రింద కూరగాయల సాగు శాశ్వత పందిరి నిర్మాణం కొరకు 2025-26 సం.లో 30 యూనిట్ల భౌతిక లక్ష్యం కేటాయించడం జరిగింది.వెదురు మిషన్ పథకం
ఈ పథకం క్రింద వెదురు మొక్కలు పొలం సరిహద్దులపై నాటించడం కొరకు 2000 మొక్కల భౌతిక లక్ష్యం కేటాయించడం జరిగింది.రైతులు సద్వినియోగం చేసుకోవాలి.ఉద్యాన పంటలకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. ఉద్యాన శాఖ అమలు చేస్తున్న పథకాల ను రైతులు సద్వినియోగం చేసు కోవాలి. ఆసక్తి కలిగిన రైతులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తో పాటు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు. బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతులు జత చేయాలి. మరిన్ని వివరాలకు ఉద్యాన అధికారుల వివరాలు
1. వి. గోవర్ధన్ , ఉద్యాన అధికారి ( సిరిసిల్ల డివిజన్) -8977714049.,2. సి హెచ్. లోకేష్, ఉద్యాన అధికారి (వేములవాడ డివిజన్) – 8977714048. ని సంప్రదించగలరు.