తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు
“నేటిధాత్రి”, హైదరాబాద్.
శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేసిన జీవో 1342 ప్రకారం పలువురు ఐపీఎస్ అధికారులకు, ఐఏఎస్ హోదా కల్పించిందని అది చట్టవిరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వడ్ల శ్రీకాంత్ అనే న్యాయవాది
ఈ పిటిషన్ విచారిస్తూ శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు కల్పించారో డిసెంబర్ 10వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద
