రశ్మికతో కలిసి మళ్లీ దొరికిపోయాడు…
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రశ్మిక మందణ్ణ మధ్య సాగుతున్న ప్రేమాయాణం ఇవాళ మొదలైందేమీ కాదు. అయితే వీరిద్దరూ ఆ విషయాన్ని ఇంతవరకూ అధికారికంగా మాత్రం చెప్పలేదు. దాంతో ఎక్కడైనా వీరిద్దరు కలిసి కనిపిస్తే పాపరాజీలకు అది పండగలా ఉంది.
రశ్మిక మాత్రం అవకాశం కుదిరినప్పుడల్లా విజయ్ ఫ్యామిలీతో తనకున్న బాండింగ్ ను విడమర్చి, విపులంగా చెబుతోంది. ఎవరు ఆ రిలేషన్ షిప్ గురించి ప్రశ్నించినా… సంకోచం లేకుండా దాచుకోకుండా డైరెక్ట్ గా చెప్పడం లేదు కానీ ఇన్ డైరెక్ట్ గా అందరికీ తెలిసిందేగా అనేస్తోంది. రశ్మిక ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా… ఆమె చుట్టు పక్కల విజయ్ దేవరకొండ లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా? అని పరికించి చూడడం అందరికీ అలవాటైపోయింది. అలానే విజయ్ దేవరకొండ ఫారిన్ ట్రిప్ వేసినా… అదే ప్లేస్ కు రశ్మిక కూడా వెళ్ళే ఉంటుందనే సందేహంతో ఆమె సోషల్ మీడియాను సెర్చ్ చేయడం కామన్ అయిపోయింది. ఏ మాత్రం హింట్ దొరికినా… ఇద్దరు ప్రేమికులు కలిసే వెళ్ళారోచ్ అంటూ ఆధారాలతో ఆ ఫోటోలను పెట్టడం పరిపాటిగా మారింది.
తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ ఇద్దరూ ముంబై ఎయిర్ పోర్ట్ నుండి వస్తున్న ఫోటో ఒకటి నిన్న రాత్రి నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైట్ కలర్ డ్రస్ లో రశ్మిక ఉండగా, బ్లూ కలర్ డ్రస్ లో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఇద్దరూ ముఖాలకు మాస్క్ పెట్టుకున్నారు. ఎయిర్ పోర్ట్ బయట కారు ఎక్కుతుండగా కొందరు దీనిని సెల్ లో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విజయ్ దేవరకొండ ఇప్పుడు ‘కింగ్ డమ్’ (Kingdom) మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూలై నెలాఖరులో లేదా ఆగస్ట్ లో విడుదల కాబోతోంది. అలానే రశ్మిక నటించిన ‘కుబేర’ (Kubera) సినిమా 20వ తేదీ జనం ముందుకు వస్తోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులను మరింత వెయిట్ చేయించకుండా ఈ జంట ఎప్పుడు తమ ప్రేమకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందో చూడాలి.