అన్ని గ్రామాలలో జాతీయ జెండా ఆవిష్కరణ
నిజాంపేట: నేటి ధాత్రి
ప్రజా పరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గల గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద, మండల కేంద్రంలో గల స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సురేష్ కుమార్,ఎంపిడిఓ కార్యాలయంలో రాజిరెడ్డి, జాతీయ జెండా ను ఆవిష్కరించారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…1948 సెప్టెంబర్ 17 న తెలంగాణ లో ప్రజా స్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎందరో మహనీయుల ఫలితమే రాష్ట్రానికి స్వేచ్ఛ వచ్చిందన్నారు. రాష్ట్రం కోసం పోరాటం చేసిన మణనీయులను కొనియాడారు.