ఆలయ అభివృద్ధికి హనుమాన్ భక్తులు విరాళం అందించడం అభి నందనీయం:అధ్యక్షుడు చంద్ర రెడ్డి

కూకట్పల్లి, జూన్ 08 నేటి ధాత్రి ఇన్చార్జి

రూ.35,500/- వంట సామగ్రి అందజేత..

కూకట్ పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ లోని శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ శివాలయం అభివృ ద్ధికి హనుమాన్ దీక్ష బూనిన స్వాములు తమ వంతు విరాళంగా రూ.35,500/- (ముప్పే ఐదు వేల ఐదు వందలు) లతో వంట సామగ్రి ని అందిం చడం అభినంద నీయమని బస్తీ అధ్యక్షు డు ఊట్ల చంద్ర రెడ్డి , ఆలయ కమిటీ అధ్యక్షుడు పేర్ని ధర్మారావు అన్నారు.గత 41 రోజులుగా హనుమాన్ దీక్ష చేపట్టిన హనుమాన్ భక్త బృందం స్వాములు జూన్ 1న హనుమా న్ జయంతి సంద ర్భంగా దీక్ష విరమణ చేశారు.సుమారు 70 మంది హనుమాన్ భక్తులు నిత్యం పూజలు చేసుకునేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేసి సహకరించిన సందర్భంగా ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు స్వాములందరూ కలిసి ఆలయానికి కావలసిన పలు వంట సా మాగ్రిని శనివారం ఆలయ కమిటీ,బస్తీ కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మా ట్లాడుతూ …హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములు ప్రతి ఏడు మాల విరమణ అనంతరం ఆలయానికి కావలసిన సా
మాగ్రిని ఇతర వస్తువులను అందజేస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తు న్నారన్నారు.ప్రతి ఒక్కరికి శ్రీ సీతారామాం జనేయస్వామి కరు ణాకటాక్షాలు సిద్ధి స్తూ,అభివృద్ధి చెందాలని ఈ సందర్భం గా వారు కోరారు.కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ గడ్డం రాజేశ్వర్ రెడ్డి,ప్రధాన కార్య దర్శి దొడ్ల రాంరెడ్డి,కోశాధికారి కిరణ్ కు మార్,బస్తి ప్రధాన కార్యదర్శి భగవంత రెడ్డి,కో శాధికారి నర్సింహులు ముదిరా
జ్,సభ్యులు దశరథ్,తడకల రాజిరెడ్డి గురుస్వాములు కృష్ణారెడ్డి,మారుజోడు శంకర్,కుల్ల రాజు,మినుముల శ్రీనివాస్ రెడ్డి,వెంకట్చారి,ఎల్లకొండ జయకుమార్ గుప్త,మహేందర్,జగన్ మోహన్రావ్,అజే య్,శ్రీకాంత్,హరి,పుష్కన్ రెడ్డి,యాద
గిరి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version