సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు…
మందమర్రి జిఎం మనోహర్
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 28, నేటిధాత్రి:
మందమర్రి ఏరియాలోని ఆర్కేవన్ ఏ గని సమీపంలో సమ్మక్క-సారలమ్మ జాతర తిరుగువారం పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 21 ను నుండి 24 వరకు కొనసాగిన జాతర శనివారం వనదేవతల వన ప్రవేశంతో పూర్తయింది.
దీంతో మహాజాతర ఘట్టం పూర్తిగా ముగిసినట్లు పూజారి దూలం కనకయ్య, మందమర్రి ఏరియా జిఎం మనోహర్ ప్రకటించారు. జాతర సమీపంలోని పోచమ్మ గుడి వద్ద మేకతో మొక్కులు చెల్లించి అనంతరం సారలమ్మ సమ్మక్క గద్దెల వద్ద సైతం మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా జిఎం మనోహర్ మాట్లాడుతూ… మందమర్రి ఏరియాలోని ఆర్కే వన్ ఏ గని సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా సమ్మక్క సారలమ్మ జాతరను సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నమని అందులో భాగంగానే ఈ సంవత్సరం సైతం సింగరేణి ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడం జరిగిందని జాతరను విజయవంతం చేసిన సింగరేణి కార్మికులకు, కార్మికేతరులకు, భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది, సింగరేణి సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు, సింగరేణి కార్మికులు సహకరించారని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం రాజేశ్వర్ రెడ్డి, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ గోవిందరావు, ఆర్కే వన్ ఏ గని మేనేజర్ జయంత్, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి ఏరియా బ్రాంచ్ సెక్రటరీ మల్లేష్, ఆర్కేపి బ్రాంచ్ సెక్రటరీ ఆంజనేయులు, ఏఐటియుసి ఫిట్ సెక్రటరీలు వినయ్, హరి రామకృష్ణ, టీబీజీకేఎస్ నాయకులు మేడిపల్లి సంపత్,జే రవీందర్ తదితరులు పాల్గొన్నారు.