గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారుల సమావేశం.

చిట్యాల, నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున ఎంపీపీ దావు వినోద అధ్యక్షతన జిపి ప్రత్యేక అధికారుల సమావేశం నిర్వహించడం జరిగిందని ఎంపీడీవో రామయ్య తెలిపారు, ఈ సమావేశంలో రానున్న వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకొనుటకుగాను గ్రామపంచాయతీ ప్రత్యెక అధికారులు కు సలహాలు సూచనలు చేయడం జరిగింది, గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి గ్రామంలో మంచినీటి సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత గ్రామపంచాయతీ అధికారులు తీసుకోవాలని ఎంపీపీ ధావు వినోద అన్నారు, ఈ కార్యక్రమంలో జడ్పిటిసి, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు ఎంపిటిసి లు, పంచాయతీ కార్యదర్శులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *