భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు సోమవారం నాడు భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయిఅధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేపరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ.భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాలను ఏర్పాటు చేయాలి చేయడంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నదని ఈ ప్రాంతం అంతా ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలు జీవన విధానం కొనసాగిస్తూ విద్య అభివృద్ధిలో వెనుక పాటు తనముతో ఉంటూ పై చదువులకు వెళ్లలేక మధ్యలోనే చదువులు ఆపివేసి నిరుద్యోగులుగా మారుతున్నా రనీ భద్రాచలంలో న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తే ఆదివాసీలు కొంతమేరకు లాయరు కోర్సు చదివి స్వయం ఉపాధితో జీవనం కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు గిరిజన బీఈడీ కళాశాల విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలతో న్యాయ కళాశాలలో సీట్లు భర్తీ చేయాలని ఆ విధానంతో భద్రాచలంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన “లా” కళాశాలను ఏర్పాటు చేయటానికి కంకణం కట్టుకోవాలని కోరారు ఈ సమావేశంలో గడ్డం వెంకన్న బాబు పాల్గొన్నారు