ఇక అభివృద్ధి పట్టాలెక్కింది..

తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికైనా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జంబుల రవీందర్

మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ డిసెంబర్ 11

తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడంతో ఇక అభివృద్ధి పట్టాలెక్కిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం సంక్షేమ రాజ్యాంగ మారబోతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జంబుల రవీందర్ అన్నారు. సోమవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడకైనా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చనీ, ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీలలో ఉచితమన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకాన్ని సైతం అందుబాటులోకి తెచ్చారని, తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందన్నారు. తనది తెలంగాణ అని చెప్పుకునే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారని జంబుల రవీందర్ కొనియాడారు. తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారన్నారు. ఇవాళ ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చన్నారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తామని సిఎం భరోసా ఇచ్చారని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version