వనపర్తి నేటిధాత్రి :
అభివృద్ధిసంక్షేమం మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ అ ని వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తుడీ మేఘా రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా రాజపేట గ్రామం,నాగవరం లో మహాలక్ష్మి పథకం ను ఎమ్మెల్యే ప్రారంభించారు రాజపేట నుండి నాగవరం వరకు మహిళలతో కలిసి బస్సు ప్రయాణం చేశారు వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానంతరం మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన మేగా రెడ్డికి వనపర్తి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ,నాయకులు,కార్యకర్తలు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు పుర వీధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు జిల్లా కేంద్రంలో నిప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే రాజీవ్ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే
మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అధికారం లోకి వచ్చిన 48 గంటలలో ఎన్నికల హామీలను గ్యారెంటీలను అమలు చేయడం ప్రారంభిo చా మని అన్నారు మహిళలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు.పేద ప్రజల కు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం పది లక్షలకు పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పి కిచ్చారెడ్డి, కాంగ్రెస్ నాయకులు రహీం,సతీష్, మాజీ జెడ్పిటిసి సభ్యులు తెలుగుదేశం నాయకులు వెంకటయ్య యాదవ్,నసీర్,తదితరులు పాల్గొన్నారు.
