సీఎం ని మర్యాదపూర్వకంగా కలిసిన సోషల్ మీడియా కోఆర్డినేటర్.

చిట్యాల, నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరు పల్లి గ్రామానికి చెందిన మక్కెన కార్తీక్ ఇటీవల జరిగిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడంలో కీలక పాత్ర వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ లందరినీ సమయం కేటాయించి కలుస్తానని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి అని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి కోఆర్డినేటర్లు అందరినీ కూడా పిలిపించి ప్రతి ఒక్కరితో ఫోటో దిగి వారికి సమయం కేటాయించడం అనేది చాలా సంతోషాన్ని కలిగించింది. అని
ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు, ముఖ్యమంత్రి నాలాంటి సోషల్ మీడియా కోఆర్డినేటర్లను గుర్తించి ఫోటో దిగి ప్రోత్సహిస్తూ ఇలాగే కాంగ్రెస్ కి మీ కృషి ఉండాలని మీరు చేసిన కృషి ఎనలేనిది అని అభినందించారు.నాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు కి భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు కి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version