భద్రాచలం నియోజకవర్గంలో ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

భద్రాచలం నేటి దాత్రి

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేసిన విధంగానే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తుంది
భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు

మహబూబాబాద్ పార్లమెంట్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండా నే
అభివృద్ధి కోసం పరితపించే పోరిక బలరాం నాయక్ గారిని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు

మాజీ గ్రంథాలయ చైర్మన్ బోగల శ్రీనివాస్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుకుంటూ మాజీ గ్రంథాల చైర్మన్ భోగల శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ, కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచల శాసనసభ్యులు తెల్లం వెంకటరావు ప్రజలతో మమేకమై మాట్లాడుతూ

గత పదిలుగా భద్రాచల నియోజకవర్గ అభివృద్ధి కొంటుపడిందని, మళ్లీ ఇంకో ఐదు ఏళ్ళు అభివృద్ధిలో వెనక్కి పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీతోనే భద్రాచల నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆలోచించి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి పోరిక బలరాం నాయక్ ని కూడా అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపించి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి విచ్చే విధంగా ప్రజలు దీవించాలని.

భద్రాచల నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు హస్తం గుర్తుపై ఓటు వేసి బలరాం నాయక్ ని గెలిపించుకోవడం ద్వారా, ఎమ్మెల్యే నిధులు,ఎంపీ నిధులు తెచ్చుకుని భద్రాచలాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం ఉందని.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా మల్లు బట్టి విక్రమార్క రెవిన్యూ శాఖ మంత్రివర్యులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నందున, వారి ముగ్గురు సహకారంతో భద్రాచలం నియోజకవర్గని వేగంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని ఎన్నికల అయన ప్రచారంలో ప్రజలకు వివరించారు.

ప్రజలతో మాజీ గ్రంథాల చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ

దక్షిణాయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయాన్ని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కానీ, పదియేలు తెలంగాణను పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ అభివృద్ధి పై ఆలోచన లేకుండా భద్రాచల రామాలయాన్ని విస్మరించారని.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ భద్రాచల అభివృద్ధికి కట్టుబడి ఉందని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపి భద్రాచలాన్ని అభివృద్ధి చేసి తీరుతుందని.

పోరిక బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం ద్వారా, తిరుమల తిరుపతి , యాదాద్రి తరహాలో గొప్ప ఆధ్యాత్మిక దేవాలయం లాగా రామాలయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన ప్రజలకు వివరించారు.

ఎన్నికల ప్రచారంలో
టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బలుసు నాగ సతీష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాసమల రాము,రాగం సుధాకర్, ఆలీ పాషా, నర్రా రాము,దుద్దుకూరు సాయిబాబా, గండేపల్లి హనుమంతరావు, ఎండి నవాబ్, అన్నేం రామిరెడ్డి,అన్నేం వెంకటేశ్వర రెడ్డి, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వసంతాల రాజేశ్వరి,తుమ్మల రాణి,ఒంగోలు దేవకి, కట్టా కళ్యాణి, పద్మప్రియ, రూపా దేవి ,కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు అధ్యక్షులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version